శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజీలో రైతు బంధు సంబరాలలో భాగంగా వ్యాస రచన పోటీలు

Published: Friday January 07, 2022

జగిత్యాల, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజీలో టిఆర్ఎస్ నాయకులు బోగోజి.ముకేష్ ఖన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో భాగంగా విద్యార్థుల కు వ్యాస రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులకు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత-సురేష్ బహుమతులు ప్రదానం చేసినారు. అనంతరం కాలేజీ నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బొడ్ల.జగదీష్, కరస్పాండెంట్ చెట్ పల్లి సుధాకర్, నాయకులు తొలి ప్రేమ శ్రీనివాస్, లవంగ రాజేందర్, సంతోష్, పాలోజు. సత్యం, వంశీ తదితరులు పాల్గొన్నారు.