గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
Published: Monday March 06, 2023
బోనకల్, మార్చి 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మరీదు రాకేష్ (18) ఆదివారం మరణించాడు.
రాకేశ్ మధిరలో ఇంటర్ సెకండియర్
చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో స్నేహితులతో
మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి
పోయాడు. వెంటనే మధిర ఆస్పత్రికి తరలిస్తుండగా
మార్గమధ్యలోనే చనిపోయాడు. గుండెపోటుతోనే
రాకేశ్ మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. మరణ వార్త విన్న తల్లిదండ్రులు , గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. రాకేష్ కుటుంబ సభ్యులను గ్రామస్తులు పరామర్శించారు.
Share this on your social network: