జీవో 69 ని రద్దు కై విశ్వబ్రాహ్మణ నిరసన ......అదనపు కలెక్టర్ రాజేశం కు వినతి
Published: Friday August 26, 2022
ఆసిఫాబాద్ జిల్లా, ఆగస్టు25 ,ప్రజాపాలన, ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం 69 జీవోను రద్దు చేసి, 55 జీవోను యధావిధిగా కొనసాగించాలని విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ)లు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ రాజేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ లు మాట్లాడుతూ జీవో 69 ని అమలు చేస్తే కుల వృత్తి చేస్తున్న కార్పెంటర్ల జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతాయని, కావున వెంటనే 69 జీవోను రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ దీని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి విశ్వబ్రాహ్మణ (కార్పెంటర్ల) కు తగు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు తూమోజు సురేష్ చారి, రాష్ట్ర నాయకులు శ్రీమంతుల వేణుగోపాల్ చారి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామోజు భాస్కరాచారి, బట్టుపెళ్లి అశోక్ చారి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటయ్య చారి, కమలాకర్ చారి, మండల అధ్యక్షుడు రాధాకృష్ణ చారి, కార్యదర్శి వెంకటేష్ చారి, కస్తూరి రమేష్, ప్రభాకర్,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: