43వ రోజు కు చేరుకున్న కొండ - అండ కార్యక్రమం

Published: Monday July 05, 2021

బోనకల్ ప్రజాపాలన ప్రతినిధి నాలుగో తేదీ గ్రామంలో కరోనా బాధితులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో బోనకల్ మండల మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ ఏర్పాటు చేసిన కొండ  అండ కార్యక్రమం 43 వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా భానోత్ కొండ మాట్లాడుతూ. కరోనా కష్టకాలంలో వైరస్ సోకిన బాధితుl ఇబ్బందులను గమనించి వారికి మూడు పూటలా ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో వారికి అండగా నిలిచి గత 43 రోజులుగా ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు భోజనాలు పంపిణీ చేసిన వారిలో అంతోటి ఆది, ధరావతు బాలకృష్ణ, బోడా కృష్ణ, గూగులోతు శేఖర్, బోడ అంజి తదితరులు ఉన్నారు