కాంగ్రెస్ పార్టీ అదర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ.

Published: Tuesday July 19, 2022
జన్నారం, జూలై 18, ప్రజాపాలన: 
 
 
జన్నారం మండలం కుండపోత  వర్షాలతో వరదల వలన ముంపు గురైన 
రోటిగూడ, తిమ్మాపూర్, గ్రామాలలో వరద కుటుంబాల బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మా బొజ్జు సోమవారం అన్నారు, ఈ సందర్భంగా  మాట్లాడుతూ ముప్పు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు వరద బాధితులను ప్రభుత్వం అదుకుంటమని తెలిపి ప్రజల కష్ట సమయంలో వున్నప్పుడు ఆదుకోకపోవడం అనేది తెలుసుకుని తక్షణమే సహయం చేయాలన్నారు,  పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని , ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని తెలిపారు, వరద బాధితులకు తక్షణమే నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి ఫసిఉల్ల, మండల ఉపాధ్యక్షుడు అంబడిపెల్లి మహేష్ , గాజుల సత్తన్న , చంద్రయ్య, నీరటి కిషన్ , వార్డ్ మెంబర్ గంగన్న యాదవ్, రహీం భాయ్, యువజన కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, సాగర్ గౌడ్,ప్రదీప్, గుగ్గిలావత్ రవి నాయక్, నగేష్ , తదితరులు పాల్గొన్నారు.