మొక్కల పెంపకం కోసం స్థలాన్ని పరిశీలించిన ఎంపీడీవో అటవీశాఖ అధికారులు
Published: Thursday September 01, 2022
బోనకల్, ఆగస్టు 30 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం ఎల్, రాపల్లి గ్రామ పంచాయతీల్లో మంగళవారం ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ ప్రతిపాదిత బీపీపీవీ స్థలాల కోసం రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అటవీ శాఖ అధికారిక ప్లాంటేషన్ అనుకూలత ,నేల స్వభావం, మొక్కల అంకురోత్పత్తి మొదలైన వాటి కోసం ధృవీకరించబడిన సైట్లకు పూర్తి ల్యాండ్ జిప్సం ట్రీట్మెంట్ అవసరమని సూచించారు. అప్పుడు మాత్రమే ఆ సైట్లు తోటల పెంపకానికి ఉపయోగపడి అనుకూలంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కృష్ణకుమారి, అటవీ శాఖ అధికారులు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: