రిపోర్టర్ రాంబాబుకు మాతృవియోగం
Published: Tuesday November 22, 2022
నివాళులర్పించిన మట్టా దయానంద్
తల్లాడ, నవంబర్ 21 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ రిపోర్టర్ మేడి రాంబాబుకు మాతృవి యోగం కలిగింది. ఆయన మాతృమూర్తి,
తల్లాడ మండలం పాతమిట్టపల్లి 9వ వార్డు సభ్యురాలు మేడి సుజాత సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆమె పార్దివదేహానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులు నాగేశ్వరావు, రాంబాబుకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ మాగంటి కృష్ణయ్య, ఇమ్మనేని ప్రసాద్ రావు, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్, దొడ్డా శ్రీనివాస రావు, పొట్రూ శ్రీను, మాగంటి వెంకటేశ్వర్లు, మాగంటి శ్రీను, మైబు, బూరుగు శ్రీను ఉన్నారు.
Share this on your social network: