ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి *ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో గుర్తు తెలియ

Published: Thursday December 22, 2022

బుధవారం రోజున  అనగా 21.12.2022 సమయం  మూడు గంటల 40 నిమిషాలకు, ఇబ్రహీంపట్నం చెరువు, ఉప్పరిగూడ రోడ్డు పోచమ్మ గుడి వద్ద మడుపు గోపాల్ అను వ్యక్తి తన యజమాని రామ్ రెడ్డి లాండ్ లో పైప్ లైన్  కోసం  జెసిబి తో అక్కడే పని చెపిస్తుండగా, దురువాసన రావడం తో అక్కడికి వెళ్ళి చూడగా ఒక గుర్తు తెలియని మగ మనిషి చనిపోయి ఉన్నది గమనించి తన యజమానికి చెప్పగా, అట్టి రామ్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ వారికి ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి చూడగా నీటిలో అట్టి వ్యక్తి చనిపోయి వ్యక్తి  చనిపోయి కుళ్ళిన స్తితిలో పైకి తేలుతున్నాడు, వయస్సు సుమారు 35-40 సం. మరియు అతనికి మృతదేహంపై నల్లని స్పోర్ట్స్ పాంట్ కలదు. అట్టి మృతదేహాన్ని ఉ స్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోధు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్.