తహశీల్దార్ కార్యాలయం లో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

Published: Thursday December 22, 2022

ప్రజాపాలన విలేకరి శంకరపట్నం డిసెంబర్ 21:

శంకరపట్నం మండల తాసిల్దార్ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని నిరుపేద క్రైస్తవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే నూతన దుస్తులను మండలంలోని పాస్టర్లకు బుధవారం రోజు  తహసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు పంపిణీ  చేసారు.ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని నూతన సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారని అయన అన్నారు. నూతన వస్త్రాలను ధరించి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, లక్ష్మణ్ రెడ్డి, కల్వల సర్పంచ్ భద్రయ్య, పాస్టర్స్ కుమార్, షడ్రక్, సామ్యూల్, జాన్ విక్టర్, జోసెఫ్, తదితర పాస్టర్లు పాల్గొన్నారు.