రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా మారిన వృక్షం పట్టించుకోని అధికారులు

Published: Thursday March 02, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 28 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామ శివారులోని ఆర్ఎంపి భవన సమీప దూరంలో
ప్రధాన రహదారి పక్కనే ప్రమాదం పొంచి ఉన్న పట్టించుకోని అధికారులు.  రోడ్డు ప్రక్కనే ఎండిపోయి విరిగిపడేలా ఉండడంతో వృక్షాలు వాహనదారులకు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. ఈ వృక్షాల వలన ప్రయాణికుల రాక పొకల పరిస్థితులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు రోడ్డు పక్కనే నరకంగా మారిన ఈ వృక్షాలు ఉన్నప్పటికీని అధికారులు కన్నెత్తైనా చూడడం లేదని ఈ దారిన నిత్యం ప్రయాణించే ప్రయాణికులు రోడ్డు భవనాల శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.