ఖమ్మం జిల్లామధిర నియోజకవర్గం షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం

Published: Thursday June 16, 2022
మధిరజూన్ 15 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో బుధవారం నాడుచింతకాని మండలం పందిల్లపల్లి గ్రామ ప్రజలతో మాట ముచ్చటవైఎస్ షర్మిల వైఎస్సార్ ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుకెటిఆర్ ఫైర్ బ్రాండ్ కాదు.తుస్సు బ్రాండ్*నేను పులిబిడ్డ... నాకు కెటిఆర్ కు పోలికేంటి.. తెలంగాణ లో అన్ని ధరలు,ఛార్జీలు పెంచారు. సామాన్యుడు ఎలా బ్రతకాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయిఇంగ్లీష్ మీడియం అని చెప్పి 3 వేల పాఠశాలలు మూసి వేశారు
 కేజీ టూ పీజీ ఉచితం అని చెప్పి పాఠశాలలు బంద్ పెడతారా.బంగారు తెలంగాణ లో బ్రతకడమే కష్టం అయ్యింది రోజు గడవడమే కష్టం అయ్యిందిడిగ్రీలు, పిజీలు చదివి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారువైఎస్సార్ హయాంలో పేద కుటుంబాల పిల్లలను ఉచిత చదువులు చదివించార. కూలి నాలీ చేసుకొని చదివిస్తే ఉద్యోగాలు రాకుంటే తల్లి దండ్రులు ఎంత బాధపడతారు..కేసీఆర్ కు అర్థం అవుతుందా..?
 ఉద్యమం సమయం లో నేను. నా ముసల్ది అని కేసీఆర్ చెప్పారు తెలంగాణ రాగానే మొత్తం అందరూ దిగారుకొడుకు,బిడ్డ,మేనల్లుడు అందరూ రాజకీయంలో దిగారు కేసీఆర్ బిద్దలంటే అంత తీపి...మన బిడ్డలు మాత్రం ఉద్యోగాలు లేకుండా రోడ్ల పై తిరగాలా.. కేసీఆర్ కుటుంభం మాత్రం పదవులు అనుభవించాలి...మన బిడ్డలు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాలి కేసీఆర్ ఒక స్వార్థ పరుడుబంగారు తెలంగాణలో  4 లక్షల కోట్ల అప్పులు చేశారుకేసీఆర్..టీఆరెఎస్ పార్టీ మొత్తం మింగేశారుబిల్లులు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కమీషన్ల రూపం లో అవినీతి జరిగిందితెలంగాణ లో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదుమూడు ఎకరాల భూమి అని మోసం...నిరుద్యోగ భృతి అని మోసం.రుణమాఫీ అని మోసం . ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలెప్రజలు కేసీఆర్ ను చీ కొడుతున్నారు ఏమైనా నిలబెట్టుకున్నారు అంటే...ప్రజలు కేసీఆర్ ముక్కు ను మాత్రం నిలబెట్టుకున్నారు అని చెప్తున్నారుటీఆరెఎస్ అకౌంట్ లో 860 కోట్లు ఉన్నాయట . ప్రతినెలా 2 రెండు కోట్ల వడ్డీ వస్తదట పార్టీ అకౌంట్ లో అంత ఉంటే..ఇక పార్టీ నేతల అకౌంట్ లో ఎన్ని కోట్లు ఉండాలక్షల ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారు
ధరణి పేరుతో భూములను తారు మారు చేసి భూములు దోచుకున్నారు400 కోట్ల రూపాయలు జూన్ 2 న ఖర్చు పెట్టారుప్రజల డబ్బు కేసీఆర్ మొహం కోసం వాడుకున్నారునిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.మీరు ప్రజల డబ్బులు పెట్టీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు
. ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రతిపక్షం లేదు
 ప్రజల తరుపున పోరాటం చేసేందుకు పార్టీ పెట్టాం
ప్రజల సమస్యల పై కాంగ్రెస్ ,బీజేపీలు పట్టించుకోవడం లేదుఅధికార పక్షానికి అమ్ముడు పోయారువైఎస్సార్ తెలంగాణ పార్టీ లో వైఎస్సార్ ఉన్నాడు.ప్రతి ఇంటిపై వైఎస్సార్ జెండా ఎగరవేయలివ్యవసాయాన్ని పండుగ చేస్తాం
 ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు ఇస్తాం ఆరోగ్య శ్రీ బ్రహ్మాండం గా అమలు చేస్తాంవృద్దులకు,వికలాంగులకు 3 వేలు తక్కువ లేకుండా పెన్షన ఎస్సీ,ఎస్టీ,బిసి ల సంక్షేమం కోసం పని చేస్తాంవైఎస్సార్ సంక్షేమ పాలన వైఎస్సార్ తెలంగాణ పార్టీతోనే సాధ్యంఎన్నికలు వస్తున్నాయి.కేసీఆర్ మళ్ళీ వస్తాడు
 గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అంటాడు
దళిత బందు కూడా ఒక మోసమే
ఎస్టీ బందు అంటాడు.బిసి బందు అంటాడు.మళ్ళీ మళ్ళీ మోసపోవద్దుమంచి నాయకుడు అయితే...ప్రజల కోసం మంచి పరిపాలన చేస్తారువైఎస్సార్ మంచి మనసున్న నాయకుడు
పందిళ్ళపాడు గ్రామస్థులువైఎస్సార్ హయాంలో లో మేము రైతులు గా చెప్పుకొనే వాళ్ళం
కేసీఆర్ హయాంలో రైతుకు విలువ లేదురైతు కు న్యాయం లేదుపత్తి వేస్తే కనీసం గిట్టుబాటు కూడా లేదు.పంట నష్టపరిహారం జరిగితే ఆదుకొనే దిక్కు లేదువైఎస్సార్ బిడ్డ గా మీరు వస్తె వైఎస్సార్ పాలన వస్తుంది అని నమ్ముతున్నాంకరెంట్ బిల్లులు అని చెప్పి భారీగా వసూలు చేస్తున్నారు
నిరుద్యోగ భృతి పై కేసీఆర్ మాట తప్పారు

మీరు ఖమ్మం నుంచి లేదాపాలేరు నుంచి పోటీ చేయాలి ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ సొంత మాల కిషోర్ కేకేడి వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు