ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
బోనకల్, సెప్టెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను పంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సైదా నాయక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని , సమసమాజ నిర్మాణానికి కృషిచేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడలలో నడవాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజాస్వామిక వాదిగా నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిగా అణగారిన వర్గాల అణిచివేత నుంచి విముక్తి కలిగించడానికి న్యాయవాదిగా పట్టాపుచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయ సమరం సాగించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దామళ్ళ కిరణ్, ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ, వార్డు మెంబర్ కనగాల నాని, గ్రామస్తులు బండి రామారావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: