పలు ప్రాంతాలను పర్యటించి మేయర్

Published: Wednesday September 29, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : నిన్న కురిసిన వర్షానికి నీటమునిగిన కాలనీలలోనీ ప్రాంతాలను పలువురు అధికారులతో కార్పొరేషన్ మేయర్ పాల్గొని పర్యవేక్షించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని పలు కాలనిలలో 9వ డివిజన్ లోని గ్రీన్ హోమ్స్ కాలనీ, 31వ డివిజన్ లోని లక్ష్మీ నగర్ కాలనీ, 22వ డివిజన్ లోని శివనారాయణపురం కాలనిలలో నిన్న కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి, కార్పొరేషన్ మేయర్ కాలనీవాసులు అందరికీ మనోధైర్యంతో భరోసా ఇచ్చారు. కాలనీలు పెరిగిపోవడం దానికి తోడు వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో వరద నీరు కాలనిలలో ప్రవహిస్తోందిని అన్నారు. ఈ సమస్యను గుర్తించి త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో ఆలోచించి పరిష్కరిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, తోట శ్రీధర్ రెడ్డి, లిక్కి మమతా కృష్ణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, ఏఈఈ రాంప్రసాద్ రెడ్డి, శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.