నర్సుల సేవలు వెలకట్టలేనివి
Published: Thursday May 13, 2021
బెల్లంపల్లి, మే 13, ప్రజాపాలన ప్రతినిధి : కరోన ఆపత్కాలంలో నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం నాడు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నర్సుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పేషెంట్లకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని ఆ సేవలకు వెలకట్టలేమని ఆయన అన్నాడు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బత్తుల సుదర్శన్, టిఆర్ఎస్ నాయకులు భీమా గౌడ్, కోమ్మెర లక్ష్మణ్, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెన్డెంట్ డాక్టర్ రాధాకృష్ణ, పలువురు వైద్యులు, నర్సులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: