నర్సుల సేవలు వెలకట్టలేనివి

Published: Thursday May 13, 2021

బెల్లంపల్లి, మే 13, ప్రజాపాలన ప్రతినిధి : కరోన ఆపత్కాలంలో నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం నాడు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నర్సుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పేషెంట్లకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని ఆ సేవలకు వెలకట్టలేమని ఆయన అన్నాడు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బత్తుల సుదర్శన్, టిఆర్ఎస్ నాయకులు భీమా గౌడ్, కోమ్మెర లక్ష్మణ్, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెన్డెంట్ డాక్టర్ రాధాకృష్ణ, పలువురు  వైద్యులు, నర్సులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.