హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Saturday May 29, 2021

బెల్లంపల్లి, మే 27, ప్రజాపాలన ప్రతినిధి : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఆస్పత్రి భవనాలను నిర్మించుకొని ప్రారంభించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం నాడు కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామంలో  నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి తో కలిసి ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని అన్నాడు, దీనివల్ల మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలను త్వరితగతిన అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మండలంలోని ప్రజలందరూ ఆస్పత్రిని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్ పి టి సి చంద్రయ్య ఎంపీపీ ఉపాధ్యక్షులు విక్రమ్, మండల తెరాస అధ్యక్షుడు రమణారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.