నేటి నుండి 12 బస్సులు నడిపిస్తాం

Published: Thursday May 13, 2021
వికారాబాద్ డిపో మేనేజర్ దైవాదీనం
వికారాబాద్, మే 12, ప్రజాపాలన బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మేరకు వికారాబాద్ డిపో నుండి మొత్తం 12 బస్సులు నడిపిస్తామని డిపో మేనేజర్ దైవాదీనం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ కు 4 బస్సులు, సదాశివాపేటకు 2 బస్సులు, తాండూర్ కు 2 బస్సులు, శంకరపల్లికి 2 బస్సులు, పరిగికి ఒక బస్సు, చేవెళ్ల - శంకరపల్లి మార్గంలో ఒక్క బస్సు చొప్పున మొత్తం 12 బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6.00 గంటల నుండి 10.00. వరకు మాత్రమే ఈ బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.