ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి ***ఎలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన

Published: Friday March 03, 2023

ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎంపిక ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంకాల శేఖర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా పిట్టల యాదగిరి ప్రధాన కార్యదర్శిగా పసుల వినోద్ కుమార్ ఉపాధ్యక్షులుగా కొత్త మహేందర్ గౌడ్ పోగాకు స్వామి కార్యదర్శి గా మ్యాకేం కరుణాకర్ మరియు పట్నం పాండు గట్టు పాండు కోశాధికారిగా రుద్రపల్లి సత్తయ్య ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంకాల శేఖర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రమేష్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని అదేవిధంగా సామాన్యులు నిత్యవసర వస్తువులు కొనాలంటే  గ్యాసు పప్పులు ఉప్పులు సామాన్య ప్రజలు కొనే స్థితిలో లేకుండా పెరగాయని   బీ ఆర్ ఎస్ పార్టీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకుండా రేషన్ కార్డులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా పేదలకు మూడేకాల భూమి ఇవ్వకుండా దళిత బంధు  ఇవ్వకుండా ఎమ్మెల్యేకు వారికి అనుకూలంగా ఉండే వాళ్లకు ఇస్తున్నారు అనేక రకమైన కంపెనీల పేరుతో పేదల భూములు బలవంతంగా తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మారితే తప్ప పేదల బతుకులు మారవనేసి వారు మాట్లాడారు కార్యక్రమంలో పట్నం బీరప్ప.  గట్టు బాషయ్య పి గోపాల్  మంకాల శ్రీనివాస్ రెడ్డి. గుంటి మహేందర్. ఏ మల్లేష్.  తదితరులు పాల్గొన్నారు.