మడుపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి

Published: Thursday April 15, 2021
మధిర, ఏప్రిల్14, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామంలో 130వ జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు గారు హాజరైనారు. ఈ సందర్బంగా చిత్తారు గారు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ అభివృద్ధి చేయాలన్నారు. భావి తరాలకు అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బోధనలు రాబోయే తరాలకు అందించాలని సూచించారు. ఈ సందర్బంగా కార్యక్రమం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గొర్రెముచ్చు యేసు, తలారి శేఖర్ బాబు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ తొగరు ఓంకార్, ఐలూరి ఉమా మహేశ్వరెడ్డి, మునుగోటి వెంకటేశ్వరావు, పారుపల్లి భద్ర రావు, జల్లా కృష్ణా రావు, రేగళ్ల సాంబశివరావు, మోదుగు రాజా రావు, కనకపూడి భాస్కర్, బజ్జీల.శ్రీను, మేడికొండ రాజా రావు, పంబి సత్యనారాయణ, గొర్రెముచ్చు బాబు రావు, పగడాల వెంకటేశ్వరావు, పగడాల శ్రీను, నండ్రు బాబు, పీట్ల పుల్లారావు మరియు మేడికొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.