కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ ..

Published: Friday July 22, 2022
పాలేరు జూలై 21 ప్రజాపాలన ప్రతినిధి నేలకొండపల్లి
మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ కార్పోరేషన్ చెక్కులను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మొక్క ను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ. పధకాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పేదల ప్రభుత్వం అన్నారు. కార్పోరేషన్ ద్వారా రుణం పొందిన లబ్దిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య,
జిల్లా పరిషత్ వైస్చర్మన్ మరికంటి ధనలక్ష్మి, చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్,  డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సర్పంచ్ సంఘం మండలాధ్యక్షుడు గండు సతీష్, పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాం బ్రహ్మయ్య, వజ్జా శ్రీనివాసరావు, వివిధ పంచాయతీ సర్పంచ్లు, ఎంపిటీసీలు,
 
సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.