కిషోర్ బాలికలకు ఆరోగ్య, సుపోషన కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్స

Published: Friday August 05, 2022

జగిత్యాల, ఆగస్టు 04 (ప్రజాపాలన ప్రతినిధి):  ఐఎంఏ హాల్లో జరిగిన కిషోర్ బాలికలకు ఆరోగ్య, సుపోషన కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ పాల్గొన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, జిల్లా కౌన్సిలర్స్ పోరం అధ్యక్షుడు పంబాల రాము, కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, నాయకులు రిజ్వన్, కూతురి శేకర్, నీలి ప్రతాప్,సంక్షేమ అధికారి నరేశ్ , ఎ.ఎన్.యంలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.