స్మశానవటికలో బోరుకు మోటర్ ఏర్పాటు: సర్పంచ్ భాగం శ్రీనివాసరావు
Published: Monday February 07, 2022
బోనకల్, ఫిబ్రవరి 6 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో సర్పంచ్ బాగం శ్రీను వాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న నర్సరీ పార్క్ కు వాటర్ సరఫరా లేనందున స్మశాన వాటికలో గతంలో దాతలు ఏర్పాటు చేసిన బోర్ కు మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీ పార్క్ స్మశాన వాటిక కు అన్నింటికి ఉపయోగ పడేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇస్రం బుజ్జి, వార్డు నెంబర్స్ బోబ్బళ్ళ క్రిష్ణ, వడ్డే బోయిన చుక్కయ్య, ఎలక్ట్రిషన్ పోట్టపింజర గోపి, రాధాక్రిష్ణ మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్ దార సురేష్, రాములు పాల్గొన్నారు.
Share this on your social network: