సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Thursday March 03, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన CH.బాలు యాదవ్ గారికి 51,000 రూపాయలు, S.కల్యాణి రెడ్డి గారికి 28,000 రూపాయలు మరియు B.సిందూజ గారికి 16,500 రూపాయలు మొత్తంగా 95,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంజూరు చేయించి ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, తెరాస ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి సి ఏ పీ ఎస్ వైస్ చైర్మన్ క్యామ శంకర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెరాస పార్టీ విద్యర్థి విభాగం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, గొట్టం శ్రీశైలం, దండెటికర్ రవీందర్, చిందం రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.