శోభాయాత్రలకు డిజే ల అనుమతి లేదు ఎస్ఐ సతీష్ జన్నారం

Published: Friday September 09, 2022
జన్నారం, సెప్టెంబర్ 05, ప్రజాపాలన: 
 
 
పోలీస్ స్టేషన్ పరిధిలో శోభ యాత్రలకు ఏలాంటి డీజేల అనుమతి లేదని ఎవరైనా నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని  జన్నారం ఎస్ఐ సతీష్ తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎస్ఐ మాట్లాడుతూ రామగుండం పోలిస్ కమిషనరేట్ ఆదేశానుసారం జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో డిజే యజమానులను పిలిపించి సిఐ అక్రాముల్లా ఖాన్ లక్షిటిపేట్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి బైండొవర్ చేయడం జరిగింది. ఎవరైనా డిజే లు ఉపయోగిస్తే వీడియోగ్రఫీ తో రికార్డు చేసి యాత్రకు సంబంధించిన వ్యక్తుల పై మరియు డిజేల యజమానులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ పోలీస్ వారికీ సహకరించి శాంతియుత, ప్రశాంతమైన వాతావరణంలో పండగలు జరుపుకోవాలని, గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఎస్ఐ కోరారు.