*అన్ని దానాల కంటే అన్నదానం మిన్న*

Published: Friday January 06, 2023

మధిర రూరల్ ప్రజా పాలన ప్రతినిధి జనవరి5 ) అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు మధులత దంపతులు అన్నారు. గురువారం స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద దాతల ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగా హనుమంతరావు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి గురువారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద  దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  దాతలు భక్తులు పాల్గొన్నారు.