మరమ్మతుల పేరుతో రోడ్డు అన్ని గుంతల మయం బిజెపి నేత జ్ఞానేంద్ర ప్రసాద్

Published: Friday March 04, 2022
శేరిలింగంపల్లి - ప్రజాపాలన/న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినాగూడ రామకృష్ణ నగర్ లో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు బీజేపీ నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మరమ్మతుల పేరిట రోడ్లు మొత్తం గుతాల మాయనికి గురిచేశారు. చాలా కాలంగా డ్రైనేజీ సమస్యలకు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. ఎక్కడికక్కడ పూర్తి కానీ రోడ్లతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. అలాగే ముఖ్యంగా డ్రైనేజీ గుంతలు ప్రమాదకరాంగా ఉన్నాయని అన్నారు. తదనంతరం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి ప్రజా సమస్యలను పూర్తి చెయ్యాలని బీజేపీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, నాయకులు మనోహర్, రవి గౌడ్, వర ప్రసాద్, కోటేశ్వరరావు, రవి, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.