ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సన్మానం

Published: Tuesday January 24, 2023
శంకరపట్నం జనవరి 23 ప్రజాపాలన రిపోర్టర్ :

కరీంనగర్ జిల్లా శంకరపట్నం బస్టాండ్ అడ్డా ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో యాదవ రత్న అవార్డు గ్రహీత శ్రీ కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ కి, తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జాతీయ మహాసభలో సమితి సభ్యులుగా పిట్టల సమ్మయ్య ఎంపిక పట్ల ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్ వీరికి శాలువాతో ఘనంగా సన్మానించారు కరీంనగర్ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న కటికి రెడ్డి బుచ్చన్న యాదవ్ కు వారు అనుబంధ సంఘాలకు చేసే సేవలకు అనుగుణంగా ఈరోజు సన్మానించడం జరిగింది అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పిట్టల సమ్మయ్య కార్మికులకు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్న సందర్భంగా వీరికి ఘనమైన సన్మానం చేయడం జరిగింది బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ యూనియన్ డ్రైవర్లకు వారికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి సేవలందిస్తానని వారి హక్కుల కొరకు నిరంతరం పోరాడి సాధించి పెడతామని అన్నారు    ఈ కార్యక్రమంలో ప్యాసింజర్ ఆటో శంకరపట్నం మండలం అధ్యక్షులు కనకం కుమార్, ఉపాధ్యక్షులు జంగ రాజేందర్ , ప్రధాన కార్యదర్శి నూనె సదయ్య ,ఎర్రబెల్లి కుమార్ , బూస తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.