రామంతాపూర్లో డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Tuesday November 08, 2022
మేడిపల్లి, నవంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) రామంతాపూర్ డివిజన్ సాయి కృష్ణ నగర్ కాలనీలో  300 ఎంఎండయతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ  పైప్ లైన్ పనులు ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి పాల్గొని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావుతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్ , మేనేజర్ రవీందర్, బి(టి)ఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, రేపాక  కుమార స్వామి, బోదాసు లక్ష్మీనారాయణ, తిప్పని సంపత్ , రామంతపూర్ బి(టి)ఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు ఎం.డి. ముస్తాక్ , ప్రధాన కార్యదర్శి జెసిబి రాజు స్థానిక కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.