భాదిత కుటుంబాన్ని పరామర్శించిన గుడిపేట్ 13వ బెటాలియన్ కమాండెంట్ యమ్ రామకృష్ణ
Published: Monday September 05, 2022
జన్నారం, సెప్టెంబర్ 04, ప్రజాపాలన:
మండలంలోని మెుర్రిగూడ గ్రామంలో ఇటివల మరణించిన టి ఎస్ ఎస్ పి హెడ్ కానిస్టేబుల్ బాదావత్ ప్రకాష్ నాయక్ కుటుంబాన్ని, మంచిర్యాల జిల్లా గుడిపేట్ 13 వ బెటాలియన్ కమాండెంట్ యమ్ రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్ లు అదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన భాదావత్ ప్రకాష్ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. మరణించిన కానిస్టేబుల్ బాదావత్ ప్రకాష్ నాయక్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.
Share this on your social network: