భాదిత కుటుంబాన్ని పరామర్శించిన గుడిపేట్ 13వ బెటాలియన్ కమాండెంట్ యమ్ రామకృష్ణ

Published: Monday September 05, 2022
జన్నారం, సెప్టెంబర్ 04, ప్రజాపాలన: 
 
మండలంలోని మెుర్రిగూడ గ్రామంలో ఇటివల మరణించిన టి ఎస్ ఎస్ పి హెడ్ కానిస్టేబుల్ బాదావత్ ప్రకాష్ నాయక్ కుటుంబాన్ని, మంచిర్యాల జిల్లా గుడిపేట్ 13 వ బెటాలియన్ కమాండెంట్ యమ్ రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్ లు అదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన భాదావత్ ప్రకాష్ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. మరణించిన కానిస్టేబుల్ బాదావత్ ప్రకాష్ నాయక్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని అన్నారు.