విద్యార్థుల కొరకు ఆర్టీసీ బస్సులను నడపాలిమండల యూత్ కాంగ్రెస్స్

Published: Tuesday September 13, 2022
విద్యార్థుల కొరకు ఆర్టీసీ బస్సులను నడపాలిమండల యూత్ కాంగ్రెస్స్ డిమాండ్ మధిర సెప్టెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు కొరకు ఆర్టీసీ బస్సులు నడపాలిమధిర ఎరుపాలెం మండలాల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థుల కొరకు ఉదయం సాయంత్రం బస్సు లేని రోడ్లలో బస్సులను పునరుద్ధరించాలని కోరుతూ మధిర బస్ డిపో ఎదుట నిరసన ధర్నాను విద్యార్థినీ విద్యార్థులతో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ మధిర రామన్నపాలెం ఎర్రుపాలెం మీదుగా గతంలో బస్సు నడిచేది ఆ బస్సును క్యాన్సిల్ చేయడం వల్ల ఆ రూట్లో నుండి ప్రయాణించే విద్యార్థిని విద్యార్థులు ప్రయాణ సౌకర్యాలు లేక సరైన సమయంలో కళాశాలకు వెళ్లి చదువుకోలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే  మధిర ఎర్రుపాలెం గట్ల గౌరవరం వరకు బస్ నడపాలని, మధిర నుండి చిలుకూరు వరకు విద్యార్థుల కొరకు బస్సులు నడపాలని, ఈ సందర్భంగా మధిర డిపో మేనేజర్ దేవదానం గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఈ విషయంపై మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత *మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకు వెళుతున్నట్లు త్వరలోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే  కృషీ చేస్తారని తెలిపారు
ఈ కార్యక్రమంలో సర్దార్ జమలా పురం కేశవరావు కళాశాల ప్రిన్సిపాల్ శ్యాం ప్రసాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ సిద్దు తమ్మిసెట్టి కిరణ్ ఎస్ఎఫ్ఐ నాయకులు వడ్రానపు మధు నండ్రు శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు