రైతు సంక్షేమానికి పెద్ద పీట : ఎమ్మెల్యే నడిపెళ్ళి దివాకర్ రావు.

Published: Tuesday January 11, 2022
దండేపల్లి, జనవరి 11, ప్రజాపాలన : కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్ళి దివాకర్ రావు అన్నారు.  సోమవారం రైతుబందు సంబరాల్లో బాగంగా దండేపల్లి మండలం లోని మామిడి పెళ్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించు కున్నా రని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోట పలుకుల గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచుశ్రీనివాస్, ఎంపిటిసి శిరీష, సుభాష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పత్తిపాక శ్రీనివాస్, కోమటిపల్లి యుగంధర్, నాయకులు నూర తిరుపతి, గాలి పెళ్లి సత్యనారాయణ, పతిపాక సంతోష్, గుర్రాల నరేష్, గొట్ల రవి, తదితరులు పాల్గొన్నారు.