ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ నిరాహార దీక్ష తాసిల్దార్ కార్యాలయం మ

Published: Tuesday August 02, 2022
బోనకల్, ఆగస్టు 01 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న 8వ రోజు ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షను జిల్లా నాయకులు తాటికొండ వెంకటరత్నం మాదిగ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కూరపాటి సునీల్ మాదిగ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఆ మాట తప్పారని, కావున ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం పెద్ద మనసుతో పార్లమెంట్ సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టాలని తద్వారా మాదిగలు రుణం తీర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ కోట హనుమంతరావు మాదిగ, మండల సీనియర్ నాయకులు తోటపల్లి చిన్న సైదులు మాదిగ, జిల్లా మాజీ నాయకులు ఏసు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ మండల అధ్యక్షుడు బొల్లె పోగు రామారావు మాదిగ, తోటపల్లి వెంకటేశ్వర్లు మాదిగ, బలవంతపు నరసింహారావు మాదిగ, అన్నేపాక రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area