ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు మానుకోండి అభివృద్ధిపై ధ్యాస పెట్టండి

Published: Tuesday May 31, 2022
టీఆర్ఎస్ నాయకుల తీరును తప్పుపట్టినమండల కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ బ్యూరో 30 మే ప్రజాపాలన :  
ప్రజల పక్షాన పోరాడుతున్న  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానుకొని  మండలం అభివృద్ధిపై ధ్యాస పెట్టాలనీ టీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. సోమవారం ధారూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో  కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మండల అభివృద్ధిని గాలికి వదిలేసి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక  విమర్శలకు దిగుతున్నారని దెప్పిపొడిచారు. ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలను పట్టించుకోవడం లేదని సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమాత్రం అందడం లేదని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు మరువరాదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో మూడు గ్రూపులున్నాయని వాళ్ళు తలో దారిలో వెళుతున్నారని స్పష్టం చేశారు. మండలంలో అభివృద్ధి పడకేసిందని కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎలాంటి గ్రూపులు లేవని అందరూ ఏకతాటిపై ముందుకెళ్తున్నామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో మండలం నుంచి  భారీ మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాములు  నాయకులు బుజ్జయ్య గౌడ్  బాబా ఖాన్ విజయభాస్కర్ రెడ్డి  రాజేందర్  చెన్నారెడ్డి లింగంపల్లి అశోక్ ముదిరాజ్  మల్లారెడ్డి  బాల వర్ధన్ రెడ్డి కల్వ కిరణ్ మల్లేశం బాబుమియా ఆగమయ్య  లాల్ మహమ్మద్  నిజాముద్దీన్  విజయ్ యాదయ్య సిద్ధూ  రమేష్  ముజ్జు  వినయ్ యాదవ్ బాలకృష్ణ  కుమ్మరి రాము  భూపాల్  మాణిక్యం  శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.