డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్ రావు
Published: Saturday May 21, 2022
మేడిపల్లి, మే20 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ ఇందిరా నగర్, శ్రీరామ కాలనీలలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు జలమండలి మరియు సివరేజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారితో కలిసి ఇందిరా నగర్, శ్రీరామ కాలనీ లలో పర్యటించి నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జిఎం జాన్ షరీఫ్, డి జి యం రజనీకాంత్ రెడ్డి, మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, సూపర్ వైజర్ కిషన్ పాల్గొన్నారు.
Share this on your social network: