ఇంటింటి వ్యాక్సిన్ సర్వే పరిశీలన

Published: Friday September 17, 2021
మధిర, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ధినఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో డోర్ టు డోర్ వ్యాక్సిన్ సర్వే నిర్వహిస్తున్నా టీమ్ లను పర్యవేక్షిస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక.లత మరియు కమీషనర్ అంబటి.రమాదేవి వారితో పాటు 13వ వార్డు కౌన్సిలర్ బి.అనిత మరియు 11వార్డు కౌన్సిలర్ జి.మాధురి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఇంకా వ్యాక్సిన్ వేయించుకోనీ వారిని గుర్తించి వ్యాక్సిన్ వళ్ళ ఉపయోగాలు తెలుపుతూ అవగాహన తెలపాలని సర్వే టీమ్ లకు చైర్ పర్సన్ మరియు కమీషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.