*ఇళ్లు లేని పేదవారికి స్థలాలివ్వాలి* -పట్టాలున్నవారికి స్థలం చూపించి డబుల్ బెదురూమ్ ఇళ్లు ఇవ

Published: Saturday February 04, 2023

-సిఐటీయు జిల్లా ఉపాధక్షులు  జగదీష్,


చేవెళ్ల ఫిబ్రవరి 03, (ప్రజాపాలన):-

చేవెళ్ల నియోజకవర్గం,
శంకర్ పల్లి  పట్టణ కేంద్రంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మరియు ఇళ్ల పట్టాలు ఉన్న పేదలందరికీ ఇళ్ల జాగాలు చూపించి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు  ఇవ్వాలని  సిఐటియు రైతు సంఘం, ప్రజా సంఘాలు శంకరపల్లి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందచారశారు,
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి జగదీష్ గారు హాజరై మాట్లాడుతూ శంకరపల్లి పట్టణ కేంద్రంలో చాలామంది పేదలకు గత ప్రభుత్వం ఇంద్రా రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారని,అప్పటినుంచి ఇప్పటివరకు ఇలా జాగాలో చూపించలేదని ప్రభుత్వం వెంటనే సర్వేనెంబర్ 278 లో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు కాబట్టి గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అలీ దేవేందర్ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లారెడ్డి గారు శంకర్పల్లి పట్టణ నాయకులు మల్లేష్ తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు