అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కు ఆర్థిక చేయూత : జిల్లా ఎస్పీ ఎం నారాయణ

Published: Tuesday July 20, 2021
వికారాబాద్ 19 జూలై ప్రజాపాలన బ్యూరో : అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ బలరాం కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత అందించామని జిల్లా ఎస్పీ ఎం.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక లక్షా 20 వేల 586 రూపాయల చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి ఎంఏ రషీద్, బలరాం కుటుంబ సభ్యులు, డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.