శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Wednesday August 04, 2021
పటాన్చేరు, ఆగష్టు 03, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ దేవభక్తిని కలిగి ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రంగంపేట లో గల శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమం లో జరుగుతున్న చండీ యాగం లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. నియోజకవర్గంలో పురాతన ఆలయాలు జీర్ణోద్ధరణ గావించడంతో పాటు పాటు నూతన ఆలయాలను నిర్మిస్తున్నట్లు స్వామికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, సత్యం పంతులు, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.