నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
Published: Wednesday August 11, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : నేడు జరుగబోయో నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరుకావాలని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల సూపరింటెండెంట్ పొగాకు సురేష్ సూచించారు. మొత్తం 106 మంది విద్యార్థులు సెంటర్ కు కేటాయించబడినారని బుధవారం ఉదయం 11:30 నుండి 1:30 వరకు జరిగే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా వాటర్ బాటిల్, మాస్కులు, సాని టైజర్స్ తీసుకుని రావాలన్నారు. గేట్ వద్ద గుమిగూడకుండా క్యూ పద్దతి పాటించాలన్నారు. అరగంట ముందుగా పరీక్షా సెంటర్ లోకి అనుమతిస్తామని, కోవిడ్ నేపథ్యంలో పరీక్షా కేంద్రంలో ప్రతి గదిని రెండు సార్లు సాని టైజ్ చేయించినట్లు వారు తెలిపారు.
Share this on your social network: