పెరాలసిస్ తో ఇబ్బందులు పడుతున్న హనుమంతుకు ఆర్థిక సహాయం అందజేత

Published: Saturday November 26, 2022
మేడిపల్లి, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) 

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని  కాప్రా డివిజన్ నిర్మల్ నగర్ కు చెందిన  

సి.హనుమంతు గత మూడు సంవత్సరాలుగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో తెరాస సీనియర్ నాయకులు, బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు.
 ‌ ఈ కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి గారితో పాటుగా బైరి నవీన్ గౌడ్, జి. ఇంద్రయ్య,  కందిగూడ సికందర్, నిర్మల్ నగర్ ప్రెసిడెంట్ పెంచలయ్య, విచిందర్, గౌతమ్, దండు, వసంత్ మరియు కార్తీక్  పాల్గొన్నారు. 
 
 
 

One attachment • Scanned by Gmail

 
 
 
 
 
 
 
 
Reply
Reply all
Forward