అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : కౌన్సిలర్ మల్లాది సవిత

Published: Thursday September 02, 2021

మధిర, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మధిర మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మల్లాది సవిత పేర్కొన్నారు. గురువారం వార్డులో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం కోడిగుడ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ గోవుల ఉష ఆర్పి నీరుకొండ ప్రతిమ ఆశా వర్కర్ లక్ష్మి పాల్గొన్నారు