వడ్డెర్ల కుటుంబాలపై పెత్తందారుల ఆగడాలు ఆపాలి

Published: Tuesday April 19, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి : నిర్మల్ జిల్లాలో న్యూ సాన్వి గ్రామంలో వడ్డెర కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లపు విగ్నేష్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు వడ్డెర కుటుంబాలపై పెత్తందార్ల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు గ్రామంలో ఇతర కులాలకు న్యాయం వడ్డెర కులస్తులకు న్యాయం అని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాభివృద్ధి కమిటీ రద్దు చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావతం కాకుండా చేయాలని డిమాండ్ చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకొని అట్టి వారి పై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.