శ్రావణమాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Published: Tuesday August 10, 2021
గుమ్మడిదల, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : శ్రావణమాస మొదటి సోమవారం సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కుంకుమార్చనలు తదితర కార్యక్రమల్లో  పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేవీ నరసింహాచార్యులు, రంగనాథాచార్యులు పాల్గొన్నారు.