జగిత్యాలలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
Published: Monday November 29, 2021
జగిత్యాల, నవంబర్ 28 ( ప్రజాపాలన ప్రతినిధి): మహాత్మ జ్యోతిరావు పూలే 131 వర్ధంతి వేడుకలు జగిత్యాలలో ఆదివారం ఘనంగా జరిగాయి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎవరు మరువలేనివన్నారు. పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వచ్చే జయంతి వేడుక వరకు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు చిర్ర శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపెళ్లి సంపత్ కుమార్, జగిత్యాల నియోజకవర్గ అద్యక్షులు బింగి నరేష్, ప్రధాన కార్యదర్శి పాలేపు నాగరాజు, పట్టణ అధ్యక్షులు రహీం, జిల్లా నాయకులు మద్దెల నారాయణ, బత్తుల దేవేందర్, వేణు, పట్టణ ఉపాధ్యక్షులు సతీష్, గంగాదర్, రాజుతోపాటు పలువురు ఉన్నారు.
Share this on your social network: