సింగిల్విండో చైర్మన్ ల జిల్లా అధ్యక్షుడికి సన్మానం

Published: Tuesday February 01, 2022
జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) :సింగిల్విండో చైర్మన్ ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అలీ బిన్ అహ్మద్ ను జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన రైతులకు అందేలా కృషి చేయాలని సూచించారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, నాయకులు అబ్దుల్లా అమాన్, సాజీర, అమర్ తదితరులు పాల్గొన్నారు.