అయ్యప్ప స్వామి ఆలయంలో 15వ వార్షికోత్స వ అన్నదానం

Published: Friday November 11, 2022
మధిర నవంబర్ 10 (ప్రజా పాలన ప్రతినిధి)
మధిర పట్టణంలోని లడక్ బజార్ అయ్యప్ప నగర్లో వేంచేసియున్న శ్రీ  అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాసం  లో గురువారం నాడు 16వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్ఎస్ సిండికేట్ స్వాములు. ఆలయంలో ప్రత్యేకంగా శివేలి ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం మాలదారులకు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం ప్రారంభం నుండి మండల పూజలు పూర్తయ్యేంతవరకు మధిర పరిసర ప్రాంత అయ్యప్ప మాలదారులకు అయ్యప్ప స్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతిరోజు ఉచితంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో మాలదారులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. 63 రోజులపాటు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి సరిపడే బియ్యాన్ని పసుర గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట రవి వారి సోదరులు వితరణగా అందజేశారు. తొలి రోజు మాలదారులకు అన్నదానాన్ని ప్రముఖ వైద్యులు సనుగుళ్ళ విజయ శ్రీనివాస్ దంపతులు ఏర్పాటు చేశారు. నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు స్వామివారి ఆలయంలో మండల పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా నవంబర్ 30 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ దాతలు సహకారంతో 63 రోజులు అయ్యప్ప మాలదారులకు భవానీలకు ఆంజనేయ స్వామి సుబ్రమణ్య స్వామి గోపయ్య గోవింద స్వాములు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో దాతలు ప్రజలు సేవా కార్యక్రమం చేసే భక్తులు వారిచే జరుపడుతుందని వారు తెలిపారు అందరూ ఆహ్వానతులే అని వారు తెలిపారు 15  మండల పూజల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై మండల పూజలు విజయవంతం చేయాలని వారు తెలిపారు అదేవిధంగా 360 రోజుల్లో ప్రతి బుధవారం భక్తులు భజన కార్యక్రమం చేసి స్వామివారి సాయంత్రం జరిగే పడిపూజ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు అనంతరం భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  , ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు చలువాది ధర్మారావు, చలువది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, గురు స్వామి పుల్లారావు, బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీధర్, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు రమేష్, మైనేడి జగన్మోహన్రావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు