"ఖిరిడి గ్రామంలో ఘనంగా లెనిన్ 99 వ వర్ధంతి" ** డివైఎఫ్ఐ కార్తీక్, కెవిపిఎస్ దినకర్ **
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 21 (ప్రజాపాలన,ప్రతినిధి) : సోవియట్ విప్లవ సాధకుడు కామ్రేడ్ లెనిన్ ను నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ లు అన్నారు. శనివారం జిల్లాలోని వాంకిడి మండలం లోగల ఖిరిడి గ్రామంలో లెనిన్ 99 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ 1870 సం, ఏప్రిల్ 22న జన్మించాలని,1924 జనవరి 21న మరణించాడని అన్నారు. లే నిన్ను స్మరించుకోవడం అదొక గొప్ప బాధ్యత అని, ఆయన ప్రపంచక దృష్టిని సిద్ధాంతాన్ని విప్లవ కార్యచరణను ఆచారాన్ని అర్థం చేసుకోవడం మారుతున్న ప్రతి పరిస్థితికి, ప్రతి మలుపుకు లెనిన్ అలాంటి సిద్ధాంతిక ఆలోచనలతోనే తన ఆచరణలను సాగించారని అన్నారు. అందుకే శ్రామిక వర్గ విముక్తి కోసం పనిచేసే ప్రతి కమ్యూనిస్టులు లెనిన్ ను ఆధ్యాయణం చేయాలన్నారు. నేతి యువత ఆదర్శంగా తీసుకుని పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన చేసుకుని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, కెవిపిఎస్,నాయకులు నిఖిల్, తిరుపతి, మనోహర్, వాసుదేవ్, కిరణ్, లు పాల్గొన్నారు.
Share this on your social network: