పలు కుటుంబాలను పరామర్శించిన తుమ్మల యుగంధర్.
Published: Monday September 19, 2022
పాలేరు సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ మండలం లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఆదివారం మండలంలోని ఆజయేండా, ముజ్జుగూడెం లో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. గువ్వలగూడెం లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, మత్స్య సొసైటీ చైర్మన్ మైకా కంకర్, రామచంద్రాపురం సొసైటీ చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం. సర్పంచ్ లు వల్లాల రాధాకృష్ణ, తేజావత్ పార్వతీ నాయకులు కొమ్మూరి నరేష్, వేగినాటి లక్ష్మీనర్సయ్య, కె. సైదారావు, ప్రసాద్. వి.శ్రీనివాసరావు. నాగేందర్, కడియాల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: