ప్రతి రైతు ఇంటికి వెళ్ళి వరంగల్ రైతుకు డిక్లరేషన్ వివరిస్తాం

Published: Friday May 20, 2022
నవాబుపేట మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు గణపురం ప్రసాద్
వికారాబాద్ బ్యూరో 19 మే ప్రజాపాలన :
ప్రతి రైతు ఇంటికి వెళ్ళి వరంగల్ రైతుకు డిక్లరేషన్ వివరిస్తామని నవాబుపేట మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు గణపురం ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 21 నుండి నెల రోజుల పాటు
ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటికి వెళ్ళి వరంగల్ లో డిక్లరేషన్ వివరిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ముఖ్య నేతల అధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 2,00,000 రైతు రుణ మాఫీ , ఎకరాకు 15,000 రూపాయలు మరియు కౌలు రైతులను కూడ 15,000 రూపాయలు అదేవిధంగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12,000 రూపాయలు, రైతు కూలీలు భూమి లేని వారికి కూడ  రైతు భీమ వర్తింప చేస్తామని డిక్లరేషన్ లో వివరిస్తామని స్పష్టం చేశారు. నవాబ్ పేట్ మండలంలోని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ డిక్లరేషన్ గురించి రైతులకు వివరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి వరంగల్ డిక్లరేషన్ చేరేవిధంగా నెల రోజులు కృషిచేయాలని కోరారు.