ఆరుట్ల గ్రామంలో డా బాబు జగ్జీవన్ రామ్ గారి 114 వ జయంతి ఘనంగా నిర్వహించారు

Published: Wednesday April 06, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలో ఆరుట్ల గ్రామ పంచాయితి ఆవరణంలో భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, వారి అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు అని, అలాగే దీర్ఘకాలిక పార్లమెంట్ సభ్యుడిగా  పనిచేసారు, అణగారిన దళిత వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారని, అంటరానితనానికి సమానత్వం కల్పించేందుకు ఎంతో కృషి చేసారని వారు అన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండా జంగయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, వార్డు సభ్యులు మోహన్ రెడ్డి, స్వప్న సురేష్, తులసి లచ్చిరాం,  పిఎసిఎస్ డైరెక్టర్ కొంగర జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంగాళ్ల యాదయ్య, ఏండి. సలాం, గుడ్డిమల్ల చంద్రయ్య, కంబాలపల్లి భాస్కర్, ఉదరి నర్సింహా, లక్ష్మీకాంత్ రెడ్డి, బుతరాజు జంగయ్య, సుంకరి ప్రవీణ్, అనిల్ రాజు, లక్ష్మా నాయక్, యాదగిరి రెడ్డి, బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.