తెలుగు సంస్కృతికి భారతీయ కళలకు గొప్ప గుర్తింపు తెచ్చిన వ్యక్తి విశ్వనాథ్ మధిర సాయి భజన మండల

Published: Saturday February 04, 2023

నాగేంద్ర శ్రీనివాసరావు మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు కళా తపస్వి కే విశ్వనాథ్ అకాల  మృతి సినీ రంగానికి తీరనిలోటని ఖమ్మం జిల్లా మధిర మండలం మధిర సాయి భజన మండలి అధ్యక్షురాలుశ్రీ పసుపులేటి పుణ్యవతి నాగేంద్ర శ్రీనివాసరావు అన్నారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ సాహిత్యానికి సాంప్రదాయాలకు ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చాయన్నారు. ఆయన మృతి సినీ రంగానికి గొప్ప తీరనిలోటు అన్నారు. విశ్వనాధ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.